శ్రీ సత్యసాయి నిత్యాన్న సేవా సిరిసిల్ల ప్రోగ్రాం కి శృంగేరి భారతీతీర్థ మహాస్వామి వారి జన్మదిన సందర్బంగా వారి ప్రధాన శిష్యులు గోపికృష్ణ శర్మ మరియు ఫణిశశాంక శర్మ లు వచ్చినారు మరియు తంగళ్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ గారి కుమారుని జన్మదిన సందర్బంగా ఈరోజు నిత్యాన్న సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామరెడ్డి ఐఎఎస్ గారు హాజరై పేషంట్ల అట్టెండర్స్ కి అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం అని వారు సేవలో పాల్గొని, సత్యసాయి సంస్థ సభ్యులను అభినందించారు.