ఓం శ్రీసాయిరాం శ్రీ సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల ఆధ్వర్యంలో కీ.శే. డా పూర్ణచందర్ గారి 18వ వర్ధంతి ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల యందు "విరించి హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్" వారి సౌజన్యంతో "ఉచిత హృద్రోగ మరియు మధుమేహ వ్యాధి చికిత్స వైద్య శిబిరం" తేదీ 24.03.2019 రోజున నిర్వహించబడినది.ముందుగా కీ.శే. డాక్టర్ శ్రీ పూర్ణచందర్ గారి విగ్రహానికి డా.శ్రీ అభిజిత్ గారు మరియు శ్రీమతి సుధా పూర్ణచందర్ గారు పుష్పమాల అలంకరణ చేసిన అనంతరం వైద్యశిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు తెలంగాణ రాష్ట్ర మహిళా సమన్వయకర్త శ్రీమతి సుధా పూర్ణచందర్ గారు డా.అభిజీత్ గారు డా.శ్రీమతి లక్ష్మి గారు మరియు ఇద్దరు జూనియర్ డాక్టర్లు నలుగురు పారమెడికల్ సిబ్బంది, ఇద్దరు లాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం లో 60 మంది పురుషులు 65 మంది స్త్రీల కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురు పేషెంట్స్ కి ఆపరేషన్స్, 8 మందికి మెడికల్ అసిస్టెన్స్ అందించేందుకు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సమితి కన్వీనర్ రాము గారు, రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు బూర రవిందర్ గారు, జిల్లా సేవాదల్ ఇంచార్జి ఉమాశంకర్ గారు, జిల్లా ఆధ్యాత్మికల ఇంచార్జి శ్రీ మురళీధర్ గారు, జిల్లా మహిళా ఇంచార్జి శ్రీమతి వందన, జిల్లా మహిళా యూత్ ఇంచార్జి కుమారి మనిత, మెడికల్ కో ఆర్డినేటర్స్ శ్రీ సుదర్శన్, శ్రీ లక్ష్మణ్, మరియు శ్రీనివాస్, 20 మంది సమితి పురుష సేవదల్ సభ్యులు, 25 మంది మహిళా సేవాదళ్ సభ్యులు సిరిసిల్ల, తంగళ్లపల్లి, బొప్పాపూర్ సమితిల సభ్యులందరూ పాల్గొన్నారు.