ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో తేదీ 23-03-2019 శనివారం 12 గంటలకు "శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహిళ విభాగం, రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యం లో "సిరిసిల్ల సత్య సాయి సేవా మందిరం " సిరిసిల్ల లో మహిళలకు "ఉచిత కుట్టుశిక్షణ శిబిరం" ప్రారంభించబడింది. ఇట్టి కార్యక్రమము రాష్ట్ర మహిళా కో-ఆర్డినేటర్ శ్రీమతి.సుధ గారు మరియు రాష్ట్ర సేవాదళ్ కో-ఆర్డినేటర్ శ్రీ.పూర్ణచందర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ.రవీందర్ గారి సమక్షంలో సిరిసిల్ల జిల్లా మహిళా కో-ఆర్డినేటర్లు వందన గారు, మనోరమ గారు, మరియు తంగళ్లపల్లి సమితి మహిళ కో-ఆర్డినేటర్లు వీణా, సుఖన్య, కావ్య గార్లు కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పరిధిలోని మహిళలు 20మంది శిక్షణకు హాజరు అయ్యారు.