ఓం శ్రీ సాయిరాం... భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవ్యాజ ప్రేమతో ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ లో కాశీ క్షేత్రంగా విలసిల్లే వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం లో తేదీ 03/03/2019 నుండి 05/03/2019 వరకు మూడు రోజుల దివ్యమైన సేవల్లో అత్యంత భక్తి, శ్రద్ద, క్రమ శిక్షణలతో సేవ నిర్వహించి సాయి శివుడి అఖండ ఆశీస్సులు పొందేలాగా ఇట్టి సేవ యజ్ఞము సఫలం కావడం లో సేవాదళ్ విధులను బాధ్యతగా , భక్తుల ఆకలి దప్పులను , బాధలు తీర్చడం లో పాలు పంచుకొని వివిధ సేవా కార్యక్రమాలను, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో భాగంగా రాజన్న సిర్సిల్ల నుండి మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ లింగ మూర్తి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ వెలయేశ్వర్ గారు, జగిత్యాల జిల్లా సేవాడల్ కో ఆర్డినేటర్ శేష శయన గారల సంయుక్త ఆధ్వర్యం లో, రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాదల్ కో ఆర్డినేటర్ ఉమాశంకర్ మరియు కూర సత్యనారాయణ, మహిళ కో ఆర్డినెటర్ శ్రీమతి వందన, జెంట్స్ యూత్ కో ఆర్డినెటర్ సత్యసాయిరాం, ఆధ్యాత్మిక కో ఆర్డినెటర్ మురళి గారు, మహిళ యూత్ కో ఆర్డినటర్ మనిత, జెంట్స్ జాయింట్ యూత్ కో ఆర్డినెటర్ బాలకిషన్, అన్ని జిల్లాల కో ఆర్డినెటర్స్, అన్ని సమితుల కన్వీనర్లు, మహిళ సేవాదల్, యూత్ కో ఆర్డినటర్స్, అన్ని సమితుల కన్వెనర్స్ ల కార్య నిర్వహణతో, యూత్ సభ్యుల శక్తివంతమైన బలము తో మొబైల్ వాటర్ టాంక్స్, ఫలాల పంపిణీ, క్యూ లైన్స్ నిర్వహణ, మహిళల లడ్డు ప్యాక్కింగ్, భోజన శాల సేవ మొదలగు సేవలను స్వామి వారిచ్ఛిన శక్తి యుక్తులతో సంపూర్ణాంగా పూర్తి చేసారు. జై సాయిరాం...