ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🪷🪷 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఈరోజు ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం 11/2/2024 ఆదివారం నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణం లో ఉదయం 10-00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో మార్చ్ నెల మొదటి వారంలో జరుగనున్న శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన గురించి, బాల వికాస్ ,మానవతా విలువలతో కూడిన విద్య (Education in human values) గురించి ప్రశాంతి నిలయం సేవలు ప్రాధాన్యత గురించి చర్చించుట జరిగింది.. ఈ కార్యక్రమంలో శ్రీ A వాసుదేవ రావు గారు, స్టేట్ సర్వీస్ కోఆర్డినేటర్, శ్రీ హరినాథ రెడ్డి గారు, స్టేట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, శ్రీ రామక్రిష్ణ గారు, స్టేట్ విద్యాజ్యోతి కోఆర్డినేటర్, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మరియు జిల్లా అధ్యక్షులు, పై అంశాలపై సమీక్షించి , కార్యక్రమాలు విజయవంతం చేయుటకు అనుసరించ వలసిన పలు సూచనలు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరామ్ 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా