ఓం శ్రీ సాయిరాం🌷 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... కామారెడ్డి జిల్లాలో గ్రామ సేవకు ఎంపిక చేసుకున్న రెండు గ్రామాలైన కన్నాపూర్ మరియు లింగాపూర్ అనే రెండు గ్రామములలో నేడు నూతన భజన మండళ్లు ప్రారంభించు కోవడం జరిగింది. ఈ కార్యక్రమము జ్యోతి ప్రజ్వలన, వేద పఠనం, భజనలతో ప్రారంభించుకొని, అతిథుల సందేశములతో కొనసాగి, భజన మండలి నిర్వహణ విధి విధానములు తెలిపి, స్వామి సందేశము, హారతి, ప్రసాద వినిమయము, 15 మొక్కలు నాటడంతో కార్యక్రమం ముగించుకున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విభాగం కోఆర్డినేటర్ మరియు జిల్లా ఇంఛార్జి శ్రీ భాస్కర రావు గారు మరియు రాష్ట్ర గ్రామ సేవా ఇంఛార్జి శ్రీ బల్ల ప్రవీణ్ కుమార్ గారు పాల్గొని భజన మండలి ప్రారంభం చేసి స్వామి వారి సందేశం తెలిపి, అందరినీ ఉత్తేజ పరిచినారు. ఈ రెండు భజన మండళ్లు త్వరలోనే సమితులుగా మారే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కన్నాపూర్ గ్రామంలో 15 మంది మహిళలు, 22 మంది పురుషులు, 21 మంది పిల్లలు కలిసి మొత్తం 58 మంది పాల్గొన్నారు. లింగాపూర్ గ్రామంలో 22 మహిళలు, 26 పురుషులు 8 మంది పిల్లలు మొత్తం 56 మంది పాల్గొన్నారు. స్వామి వారు ఇలాంటి అవకాశములు మరెన్నో ప్రసాదించాలని కోరుకుంటూ..... 🌷జై సాయిరాం🌷