*ఓం శ్రీ సాయిరాం * *స్థానిక జగిత్యాల యందు పురాణిపేటలో ఒక అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలి సర్వం కోల్పోయిన ఒక పేద కుటుంబం, ప్రస్తుతం ఏ తోడు లేక ఒంటరిగా జీవిస్తున్న ఒక మహిళ "పోకల చంద్రకళ " కు శ్రీ సత్యసాయి సేవా సంస్థ, జగిత్యాల తరపున రూపాయలు 10,000 విలువగల చీరెలు , చద్దర్లు , వంటకు కావలిసిన బోళ్ల సామాగ్రి మరియు ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులతో సహకారాన్ని అందించడం జరిగింది. ఒక 6 నెలల పాటు అమృత కలశం రూపంలో పప్పు దినుసులను కూడా అందచేయడం జరుగుతుంది.* ఇట్టి పవిత్ర సేవా కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సభ్యులు అందరకీ భగవానుడు దివ్యమైన ఆశీస్సులు అందజేయాలని ప్రార్థిస్తూ ... జై సాయిరాం 🙏 *శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల *