ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో, ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో జరుప నిశ్చయించిన, ప్రతీ నెలవారీ సమావేశం నకు మహబూబాబాద్ జిల్లా ఇంచార్జి శ్రీ P.S.కృష్ణ ప్రసాద్ గారు మరియు శ్రీ T సోమేశ్వర్ గారు, మహబూబాబాద్ టౌన్ కు విచ్చేసి, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా స్వామి కార్యక్రమంలను విస్తరింపజేయుటకు కావలసిన సూచనలు ప్రణాళికలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మహబూబాబాద్ జిల్లా డీపీ, జిల్లా భాద్యులు, మహబూబాబాద్, కేసముద్రం సమితి కన్వీనర్లు , మరియు సమితి భాద్యులు, మహిళలు మరియు పురుషులు, కురవి భజన మండలి కన్వీనర్, మరియు సాయి సభ్యులు సీనియర్ డివోటీస్. పాల్గొనడం జరిగింది. 1, బాలవికాస్ సెంటర్ లను నెలకొల్పడం 2, విద్యా జ్యోతి స్కూల్స్ లలో ఏర్పాటు చేయడం 3, భజన సెంటర్ లను పెంచడం 4, భజన మండలి లను సమితిలుగా నెలకొల్పడం 5, క్రొత్త మండలాలలో స్వామి కార్యక్రమాలను విస్తరింప చేయుటకు క్రొత్త వారిని వెళ్లి కలవడం. 6, సంస్థ ఆదేశాలను తుచా తప్పకుండా కార్యక్రమాలను నిర్వహించడం. పై కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించుకోవలసింది గా జిల్లా ఇంచార్జ్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు సూచించారు. స్వామి అనుగ్రహం గా భావిస్తూ జిల్లా లో అమలు పరుచువిషయాలను ఈ సమావేశం లో మాట్లాడుకోవడం జరిగింది. 🙏జై సాయిరాం 🌺శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహబూబాబాద్ జిల్లా