💐 ఓం శ్రీ సాయిరాం💐 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... తేదీ. 26.3.2023 రోజున కామారెడ్డి జిల్లా లోని బాన్స్ వాడ షిర్డీ సాయి మందిర ప్రాంగణంలో సాయంత్రం 6 గం.లకు నూతన భజన మండలి ప్రారంభం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్తగా శ్రీ జగన్నాథ రావు గారు (Hyd), జిల్లా ఇంఛార్జి మరియు రాష్ట్ర వైద్య విభాగం ఇంఛార్జి శ్రీ భాస్కర్ రావు గారు మరియు రాష్ట్ర గ్రామ సేవల ఇంఛార్జి శ్రీ బల్ల ప్రవీణ్ కుమార్ గారు .......మరియు కామారెడ్డి, పెద్ద దడిగి, బిచ్కుంద నుండి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 40 మంది పురుషులు 34 మంది మహిళలు పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులైనారు. సాయిరాం.