ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,,, ఈరోజు మన సిద్దిపేట మందిరంలో జరిగిన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో బాలవికాస్ విద్యార్థుల వేదం పఠించడంతో ప్రారంభమైంది.పదిమంది మహిళలచే నూతనంగా కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభం చేశాం. మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో జ్యూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ తరగతులు ప్రారంభించాము. గ్రామ సేవ మహా యజ్ఞం ప్రశాంత్ నగర్ లో 6 మంది మహిళలచే కుట్టు శిక్షణా శిబిరం ప్రారంభించాము. ఇట్టి కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి మాధవి లత గారు స్టేట్ మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి నాగజ్యోతి గారు సిద్దిపేట జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ అరుణ గారు పాల్గొనడం జరిగింది. మాధవి లత గారు వారు శిక్షణా శిబిరంలో నేర్చుకోవలసిన, నేర్పవలసిన విధానాలను చక్కగా సూచించారు. నాగజ్యోతి గారు సేవ వలన మనం పొందే ఆనందం అనుభూతిని చక్కగా వివరించారు. ఇటువంటి సేవా భాగ్యాన్ని ప్రసాదించిన భగవానునికి సర్వదా కృతజ్ఞతలతో సత్యసాయి సేవా సమితి జిల్లా సిద్దిపేట జై సాయి రామ్🙏🏽