ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఫిబ్రవరి 19వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా,,, వర్గల్ భజన మండలి వారు ఒకరికి అమృత కలశం ఇచ్చారు. గజ్వేల్ సమితి వారు లలితా సహస్రనామ పారాయణ చేసి ఇద్దరికీ అమృత కలశాలు అందజేశారు. హుస్నాబాద్ సమితి వారు సాయి గాయత్రి మంత్రంతో ముగ్గురికి అమృత కలశాలు అందజేశారు. సిద్దిపేట సమితి వారు ఉదయం రుద్రాభిషేకం చేసి ఇద్దరికీ అమృత కలశాలు అందజేసి, స్థానిక సబ్ జైల్లో రుద్ర పారాయణ మరియు సత్సంగం నిర్వహించి ప్రసాదం అందజేయడం జరిగింది. వేసవికాలం సందర్భంగా జైలర్ గారు కోరిన విధంగా ఒక సీలింగ్ ఫ్యాన్ మరియు రెండు మంచినీటి రంజన్లు గ్లాసులు అందజేయడం జరిగింది. సదా సాయి సేవలో,,, సత్యసాయి సేవా సంస్థలు. జిల్లా సిద్దిపేట