దీనజన సేవలు🔹 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 97వ జయంతిని పురస్కరించుకొని తేదీ 23-11-2022 నాడు భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి,జగిత్యాల ఆధ్వర్యంలో "మందిరంలో" "వివిధ దీనజన సేవలు" నిర్వహించడం జరిగింది 👆 గౌరవనీయులు స్థానిక జగిత్యాల MLA శ్రీ డా. సంజయ్ కుమార్ గారు , ZP చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారు , మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు , కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ గారు , బొడ్ల జగదీశ్ గార్లు స్వామి వారి జయంతిలో విశిష్ట అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా - నలుగురు పిల్లలతో కుటుంబ భారాన్ని మోస్తున్న ఒక బీద మహిళకు మోటార్ తో కూడిన కుట్టు మెషిన్ ని పంపిణి చేయడం జరిగింది. దేసాయిపేట గ్రామం నుండి భీమారం హై స్కూల్ కి 3 కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్తున్న నలుగురు (4) పేద విద్యార్థినులకు 4 సైకిల్స్ ని అందచేయడం జరిగింది. అలాగే 20 మందికి బట్టలు , అమృత కలశములు , చెద్దర్లు పంపిణి చేయడం జరిగింది. తదనంతరం మహా నారాయణ సేవ ను నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల