ఓం శ్రీ సాయిరాం... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, సిద్దిపేట జిల్లా వివిధ సమితీలలో 19 సెప్టెంబర్ 2022వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సేవా కార్యక్రమాల వివరాలు... #వర్గల్ భజన మండలి వారు సాయి గాయత్రి మంత్రం(108) జపించి ఒకరికి అమృత కలశం అందజేశారు. #కుకునూరుపల్లి భజన మండలి వారు లలితా సహస్రనామ పారాయణ మరియు అధ్యయనమండలి నిర్వహించి సాయి గాయత్రిమంత్రము(108)తో ఐదు మందికి అమృత కలశాలు అందజేశారు. #హుస్నాబాద్ సమితి వారు భజన నిర్వహించి ఏడుగురికి అమృత కలశాలు అందజేశారు. #బూరుగుపల్లి సమితి వారు సాయి గాయత్రి మంత్రం(108) చేసి ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు స్వల్పాహారం అందించారు. #గజ్వేల్ సమితి వారు లలితా సహస్రనామ పారాయణ చేసి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మందికి స్వల్పాహార సేవ అందజేశారు. #సిద్దిపేట సమితి వారు రుద్రాభిషేకం చేసి, సాయి గాయత్రి మంత్రం (108)జపించి ఇద్దరికి అమృత కలశాలు అందించిరి. తల్లిదండ్రులను కోల్పోయి, నానమ్మ దగ్గర ఉంటున్న ఇద్దరు పిల్లలకు రెండు బెడ్ షీట్స్, రెండు నెలలకు సరిపడు కిరాణా సరుకులు అందజేసి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మందికి స్వల్పాహార సేవను అందజేసిరి. *సదా సాయి సేవలో** కృతజ్ఞతలతో BSSSSO జిల్లా : సిద్దిపేట జై సాయిరాం🙏🙏