ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణా రాష్ట్రం * భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవాదళ్ సభ్యులకు రాష్ట్ర కోఆర్డినెటర్స్ చే శిక్షణా కార్యక్రమం 23/9/2022 శుక్రవారంనాడు ఉదయం 10.00 గంటలనుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నేలకొండపల్లి మందిర ప్రాంగణంలో నిర్వహించబడింది... ఈ శిక్షణా కార్యక్రమంలో శ్రీమతి K గీతా పావని గారు రాష్ట్ర సేవాదళ్(మహిళా) కోఆర్డినేటర్ పాల్గొని సేవాదళ్ సభ్యులకు చక్కటి శిక్షణ ఇచ్చారు.. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 185 మంది మహిళలు 122 మంది పురుషులు మొత్తం 307 మంది సభ్యులు ఎంతో ప్రేమగా, శ్రద్ధతో పాల్గొన్నారు. ధనియాలగూడెం గ్రామం నుండి స్త్రీలు , పురుషులు అధిక సంఖ్యలో ట్రాక్టర్ పై కూడా శిక్షణా కార్యక్రమానికి తరలి రావడం స్వామి ప్రేమ అనుగ్రహాలకు తార్కాణమై పండుగ వాతావరణం తలపించింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లా లో జరుగుతున్న ఆధ్యాత్మిక/ సేవా కార్యక్రమాలు సమీక్షిస్తూ , నవంబర్ 4,5,6 తేదీలలో ఖమ్మం జిల్లా లో జరుగనున్న శ్రీ RJ రత్నాకర్ గారి(మేనేజింగ్ ట్రస్టీ) పర్యటన గురించి ,ప్రశాంతి నిలయం లో సేవలు గురించి , జనవరి 2023 లో చేపట్టనున్న రైతు పర్తి యాత్ర కార్యక్రమం గురించి చర్చించారు. స్వామి ఆశీస్సులతో అనూహ్యంగా 300 పైగా సేవాదళ్ శిక్షణకు హాజరుకావటము, ఇతరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనటం జనవరి 2023 లో నిర్వహించనున్న రైతు పర్తి యాత్రకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది.. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ గారు , జిల్లా మహిళా ఇంచార్జ్ మరియు ఇతర కోఆర్డినెటర్స్/ఇంచార్జెస్ పాల్గొన్నారు. ఇంకా జిల్లా , సమితి కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, భజనమండలుల కన్వీనర్లు మరియు యూత్ సభ్యులు , మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా..