ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా తరఫున గోదావరి వరదలతో భద్రాచలం పరిసర ప్రాంతంలో తీవ్రoగా నష్ట పోయిన ముంపు ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఒక 500 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, ఆయిల్, ఆలుగడ్డలు, కారం, ఉప్పు, పప్పు మొదలగు 13 రకముల ఆహార దినుసులు మరియు వస్త్రములు (ఒక ఒక చీర) అందించుటకు సత్తుపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి నుండి బయలు దేరిన (01 DCM ) వాహనము శ్రీ సత్యసాయి సేవాసంసంస్థలు ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ గారు మరియు జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ భాస్కర్ గారు, నరసింహారావు గారు ఖమ్మం సమితి కన్వీనర్, జిల్లా మహిళా ఇంచార్జ్ శ్రీ మతి డాక్టర్ ఉమా గారు,మరియు సత్తుపల్లి సేవాదళ్ కన్వీనర్ శ్రీ మూర్తి గారు,కన్వీనర్, సత్తుపల్లి పురప్రముఖులు, ఖమ్మం జిల్లా వివిధ సమితి సబ్యులు అందరి సమక్షంలో,సత్తుపల్లి సత్యసాయి సేవాసమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గాదేసత్యంగారి సూచనలు మేరకు, భగవాన్ సత్యసాయి నిండైన శుభాశీస్సులుతో ఇట్టి కార్యక్రమం,గౌరవనీయులు శ్రీ చండ్రా వెంకటవీరయ్య గారు,(సత్తుపల్లి MLA గారు) భగవాన్ సత్యసాయి బాబా మందిరంలో జ్యోతి ప్రజ్వలన స్వామి నిస్వార్ధ సేవలు కొనియాడి, ఇట్టి నిస్వార్ధ సేవలో పాల్గొనుట సత్యసాయి సభ్యులుగా మీఅందరికి అదృష్టం అని కొనియాడారు. అనంతరం వారు పుష్పములతోపూజించి, కొబ్బరికాయ కొట్టి ఫ్లాగ్ ఆఫ్ చేయగా సత్తుపల్లి సత్యసాయి మందిరం నుంచి భద్రాచలం ఏరియాలోని వేలేరు,వెంకటాపురం, శ్రీధర ఈ మూడు గ్రామాలలోని 500 కుటుంబాల కు అమృత కలిశ్యాలు పంపించటం జరిగినది. మరియు అక్కడ పాఠశాలవిద్యార్థులకు బిస్కెట్ చాకోలెట్స్, అక్కడ వారికి అందరికీ భగవాన్ బాబావారి ప్రసాదం అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలొ సత్యసాయి సేవాయూత్ పిల్లలు,బాలవికాస్ గురువులు బాలవికాస్ పిల్లలు మహిళలు,ఇతర సేవాదళ్ సభ్యులు ఉత్సాహం గా ఈ సేవలో ప్రత్యేకంగా పాల్గొని వివిధ సేవలు చేసుకున్నారు . మరియు ప్రసాదం ప్రిపరేషన్ లో మరియు సేవలో పాల్గొన్న, మహిళలు,యూత్ పిల్లలు, ప్రతిఒక్కరికి భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని, కలుగుతాయని పూర్తివిశ్వాసం తో.,....🙏 ఇంచార్జ్ కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవాసమితి, సత్తుపల్లి /ఖమ్మం జిల్లా