మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం - 19/06/2022 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మరియు సరూర్ నగర్ సమితి వారు 100 సార్లు నిర్వహించ తలపెట్టిన "మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం" ను ఆ సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో అత్యంత ఉత్క్రుష్టమైన , అత్యున్నత ఫలితాన్ని కలిగించు, మహా పుణ్యమైన, దివ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం 33 వ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ను తేదీ 19-06-2022, ఆదివారం నాడు: ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జగిత్యాల సత్యసాయి మందిరం నందు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం అల్పాహార ప్రసాదం మరియు కార్యక్రమానంతరం మధ్యాహ్నం భోజన ప్రసాదం ఆహూతులందరికి అందచేయబడింది. ఇట్టి పుణ్య ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు , జగిత్యాల జిల్లా కార్యవర్గం , సమితిల కన్వీనర్ లు మరియు కార్యవర్గ సభ్యులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎనలేని ఆనందాన్ని పొందడం జరిగింది , పాల్గొన్న ప్రతి ఒక్కరు వారి పూర్వజన్మ సుకృతం గా భావించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ సాయి శివుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల