ఓం శ్రీ సాయిరాం పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఈ రోజు 3/5/2022 ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణంలోని, గాంధీ చౌక్ దగ్గర ఉమన్స్ కాలేజి పక్కనే ఉన్న ఈద్గా వద్ద ప్రార్ధనల సందర్భంగా ముస్లిం సోదరుల పాద రక్షలు భద్రపరిచే సేవను స్వామి అనుగ్రహం మేరకు నిర్వహించటం మరియు వారికి మజ్జిగ పంపిణీ తో సహా వారికి సేవలు అందించటం జరిగినది. ఈ సేవలో జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు ఖమ్మం సమితి కన్వీనర్ మరియు సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు అందరూ అంకితభావంతో ఈరోజు ఉదయం 8 గంటలనుండి 11 .30 గంటల వరకు పాల్గొన్నారు.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.. ఆదర్శవంతమైన సేవలు అందించిన సంస్థ సభ్యులను, సేవలను పలువురు ముస్లిం సోదరులు అభినందించారు. ఈ సేవలో పాల్గొన్న అందరికీ సాయిరాం