ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి బందువులందరికీ సాయిరాం. ఈరోజు 28.04.2022 గురువారం నాడు రోజురోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు నల్లగొండ పురవీదులలో 50 మంది రిక్షా కార్మికులకు, హమాలీలకు, రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులకు టోపీలు పంచడము జరిగినది. అదేవిదముగా పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ రోడ్డు తిరుమల థియేటర్ వద్ద సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రములో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడము జరిగినది. ఈ సేవా కార్యక్రమాల్లో సమితి కన్వీనర్ కృష్ణబాబు గారు, విశ్వేశ్వర్, తుకారాం, శివ, చందు, విజయ, గీత తదితర సేవాదళ్ పాల్గొన్నారు. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ.