ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి బంధువులందరికీ సాయిరాం. ఈరోజు 19.04.2022 మంగళవారం నాడు శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ హైదరాబాద్ రోడ్ తిరుమల థియేటర్ వద్ద MRF Tyres ఎదురుగా చలివేంద్రము ను ఏర్పాటు చేయడము జరిగింది. తదుపరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పద్మానగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామగిరి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జె.బి.స్ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న 80 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్యాడ్ మరియు పెన్నులు పంచి వారికి స్వామి ఆశీస్సులు ఉండాలని, పరీక్షలు మంచిగా వ్రాసి ఉత్తీర్ణులు కావాలని, పిల్లలు పరీక్షలు అంటే భయం వీడి ధైర్యముగా పరీక్షలు వ్రాయాలని, పిల్లలకు కొన్ని మంచి విషయాలు తెలియచేసారు. ఈ సేవా కార్యక్రమములో MRF Tyres యాదగిరి గారు, APTECH Computers వెంకట్ రెడ్డి గారు మరియు సమితి కన్వీనర్ కృష్ణబాబు గారు, డా.జయప్రకాష్ రెడ్డి గారు, సభ్యులు సందీప్ రెడ్డి, విశ్వేశ్వర్, తుకారామ్, నరసింహ, కే శ్రీనివాస్, వంశీ, శివ కుమార్, జగదీశ్, చారి, విజయ, కస్తూరి పద్మ, శోభ, జ్యోతి, పున్నమ్మ, పద్మ శ్రీనివాస్, చంద్రిక, తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ.