ఓం శ్రీ సాయిరాం🕉️ భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 27-03-2022, ఆదివారం రోజున సిద్దిపేట సమితి వారిచే చందాపూర్ గ్రామంలో, ఉదయం 8.30 ని"కు జ్యోతి ప్రజ్వలన ,నగరసంకీర్తనను నిర్వహించి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ▪️ఈ మెడికల్ క్యాంపులో, హైదరాబాదు నుండి వచ్చినటువంటి మొబైల్ డెంటల్ వ్యాన్ , ఇద్దరు డెంటిస్ట్ డాక్టర్లు ,మరియు నలుగురు పారామెడికల్ సిబ్బంది ,వీరితో పాటు స్థానిక వైద్యులు అయిన Dr.సరిత(డర్మటాలజిస్ట్) మరియు Dr.ప్రతిమ (గైనకాలజిస్ట్) లు పాల్గొన్నారు. ▪️ చందాపూర్ పాఠశాల మరియు రాంపూర్ ప్రైమరీ స్కూల్ కు చెందిన మొత్తం 166 మంది విద్యార్ధిని ,విద్యార్థులందరికీ డెంటల్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ▪️విద్యార్థులందరికీ బ్రష్ ,టూత్ పేస్ట్ ల పంపిణీ , మరియు స్క్రీనింగ్ లో సెలెక్ట్ అయిన పిల్లలకు మొబైల్ మెడికల్ వ్యాన్లో మౌత్ వాష్ సంబంధించిన ట్రీట్మెంట్ నంతా మొబైల్ వ్యాన్లో చేయడం జరిగింది ,ఇంకా సీరియస్ ట్రీట్మెంట్ కావాల్సిన కొద్దిమంది పిల్లలను హైదరాబాద్ హాస్పిటల్ కు సెలెక్ట్ చేసుకుని వారికి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ▪️ప్రాంతీయంగా ఉన్నటువంటి డర్మటాలజీ నిపుణులు Dr. సరిత గారు, మరియు స్త్రీలకు సంబంధిత గైనిక్ వైద్య నిపుణులు Dr. ప్రతిమ గారు ట్రీట్మెంట్ ప్రెస్క్లబ్ చేయడం ప్రారంభించి, 50 మంది డెర్మటాలజి పేషెంట్స్ కు మరియు 40 మంది గైనిక్ స్త్రీలకు ట్రీట్మెంట్ చేసి వారికి అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగింది. ▪️ అంతే కాకుండ ఐదుగురు నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ▪️విద్యార్థులతో బాలవికాస్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ▪️ ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీ బొడ్డు నర్సింలు గారు, గ్రామ కార్యదర్శి మహేశ్వరి మేడం గారు, ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు ఎస్ఎంసి చైర్మన్ మరియు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి సమన్వయ సభ్యులు , సేవాదళ్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యనిపుణులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇట్టి సేవకు పాత్రులు అయిన సేవాదళ్ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతు,మనఅందరిపై ఆ భగవానుని కృపా ,కటాక్ష్యాలు వెన్నంటి ఉండాలని పార్థిస్తూ....సాయిరాం🙏. .....సదా సాయి సేవలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం 🙏 జై సాయిరాం....