ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 01-03-2022 రోజున మహాశివరాత్రి పర్వదినోత్సవమును పురస్కరించుకొని మిర్యాలగూడ సమితి పరిధిలో గల శ్రీ మీనాక్షి అగస్తేశ్వర మరియు శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి దేవస్థానం నందు ఉమ్మడి నల్గొండ జిల్లా ( నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ) సేవాదళ్ సభ్యులచే సేవా కార్యక్రమములు నిర్వహించడం జరిగినది. ఉదయం ఓంకారం, సుప్రభాతం మరియు నగర సంకీర్తనతో సేవా కార్యక్రమములు మొదలు పెట్టి సాయంత్రం స్వామివారి మహా మంగళహారతితో కార్యక్రమం ముగించడం జరిగినది. కార్యక్రమముల వివరములు : 1).క్లాక్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తుల చెప్పులు భద్రపరచడం జరిగినది. 2).క్యూ లైన్ లలో ఉన్న చిన్న పిల్లలకు, ముసలివారికి పాలు పంపిణి చేయడం. 3) భక్తుల సౌకర్యార్ధము క్వి లైన్ లో లో దర్శనానికి పంపటం జరిగినది. 4).క్యూ లైన్ లలో భక్తులకు మంచి నీళ్లు పంపిణి చేయడం జరిగినది. 5).సీవాదళ్ సభ్యులకు, పురోహితులకు, పోలీస్ సిబ్బందికి మరియు భక్తులకు మాస్కులు పంపిణి చేయడం జరిగినది. 6) వచ్చిన భక్తులకు ప్రసాదము పంపిణీ చేయుట జరిగినది. మరియు భక్తుల సౌకర్యర్థం మంచి నీటిని పంపిణీ చేయుట జరిగింది. 7. లక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయం లో క్వి లైన్ భక్తులను పంపించుట జరిగినది.. 8).దేవస్థానం వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ సిబ్బంది, మీడియా మరియు ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖ వారికి మరియు భక్తులకు కలిపి మొత్తం 500 మందికి నారాయణ సేవ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో మొత్తం మహిళలు, పురుషులు కలిపి 200 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో జిల్లా సమన్వకర్త నల్గొండ జిల్లా.