తేది 01.03.2022 మంగళవారం, మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి & వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ వారి నిర్వహణలో దాదాపు 86మంది సేవాదళ్ పాల్గొనడం జరిగింది. పులిహోర తయారీలో, కౌంటర్ ల వద్దకు పులిహోర ప్యాకెట్లను, లడ్డు ప్రసాదాల ప్యాకెట్లను సరఫరా చేయడం మరియు ప్రసాదాల సేల్స్ కౌంటర్ సేవలను మన స్వామి వారి కృపతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరంల నుండి ఇదే విధంగా సేవలు చేసే భాగ్యాన్ని ప్రసాదించిన మన స్వామి వారికి, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి కృతజ్ఞతా పూర్వకంగా పాదాభి వందనములు తెలియ జేస్తూ...... *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా*