*శ్రీ సత్యసాయి భగవానుడు కరుణించాడు, వరుణ దేవున్ని పక్కకు పెట్టి, నిన్న జరిపిన శ్రీ సాయి జననీ గిరిజన సంక్షేమ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయించారు. *ఏటూరు నాగారం పరిసర ప్రాంతాలైన *గుండెంగివాయి, గంటల కుంట, ఏడిశేట్టిపల్లి, చింతల పాడు, ముడిలుతోగు, చింతలమోరి గిరిజన ఆదివాసీ 200 ఇండ్లల్లో సోలార్ ల్యాంప్ దీప కాంతులు వెలిగాయి. చిన్నారి చిన్న పిల్లలు 400 మంది సాయి ప్రోటీన్ ఫుడ్ ఆనందంతో అందుకున్నారు. 200 మంది గిరిజన మహిళలు చీరలు చేత పుచ్చుకున్నారు. దోమల బారినుండి కాపాడు కునేందుకు 200 గిరిజన కుటుంబాలు దోమ తెరలతో, దుప్పట్లతో హాయిగా నిద్రపోతున్నారు. పెద్దలు, మహిళలు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, 300 మందికి పైగా *వరంగల్ మరియు ఏటూరు నాగారం నుండి వచ్చిన డాక్టర్ల బృందం* వారిచే పరీక్షలు చేయించుకొని మందులు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కుంటున్నారు. ఇది, తేది 26.09.2021 ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన *శ్రీ సాయి జననీ*గిరిజన సంక్షేమ సేవా కార్యక్రమములో* శ్రీ పి. వెంకట్రావ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించి విజయవంతం చేయించారు. *సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, సమాజ సేవను దైవ సేవగా భావించండి. భగవంతుని ప్రేమను పొందుటకు ఇది ఉత్తమమైన మార్గము. అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి. తద్వారా మీ జీవితమునకు పవిత్రత చేకూరుతుంది అని శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన సందేశాన్ని* ఆచరించి చూపించిన ఈ సేవా కార్యక్రమానికి గిరిజన ఆదివాసీలు ప్రేమతో కృతజ్ఞతలు తెలుపడం ఎంతో సంతోషకరమైన విషయం అని కొనియాడుతూ... సదా సాయి సేవలో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ ch మల్లా రెడ్డి.