ఓం శ్రీ సాయిరామ్ *నవంబర్ 9, 2021 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో భూపాల పల్లి కి 37 km దూరంలో వున్న శ్రీ సత్యసాయి భజన మండలి, నిజాంపల్లి గ్రామంలో మన రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ అశోక్ రెడ్డి గారి ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.* వివరాలు:- ఉదయం ఏడు గంటల వరకు నిజాంపల్లి చేరుకొని, గ్రామ సంకీర్తన గ్రామ ప్రధాన వీధులలో వెళ్తూ శ్రీ కోదండ రామ ఆలయం వరకు చేయడం జరిగింది. దాదాపు 157 మంది భక్తులు (15- బాలికలు, 12- బాలురు, 70- మహిళలు & 60- పురుషులు) పాల్గొన్నారు. బాలవికాస్ విద్యార్థులు పది మందికి *ఓం శ్రీ సాయిరాం* లిఖిత నామ జపం నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. కోదండ రామ దేవాలయ ప్రాంగణం లో వున్న చెత్తను, పిచ్చి మొక్కలను తీసివేసి స్వచ్ఛత సేవలు నిర్వ హించాము. శ్రీ అశోక్ రెడ్డి గారు, శ్రీ సత్యసాయి సేవలు, మన వ్యక్తిగత సాధన, సమితిలో, భజన మండలి లో ప్రతి భక్తులు చేయవలసిన కార్యక్రమాలు వివరించి, స్వామి వారి మిరాకిల్స్ మధ్య మధ్యలో ఉదహరిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగించారు. హాజరైన 27 మంది బాల వికాస్ విద్యార్థులకు సాయి ప్రోటీన్ ఫుడ్ ను పంపిణీ చేయడం జరిగింది. గ్రామం లోని భక్తులందరూ *రాబోయే రోజుల్లో భజన మండలి నీ శ్రీ సత్య సాయి సేవా సమితి గా చేసుకోవాలని స్వామికి సంకల్పం* చేయడం జరిగింది. గ్రామంలో అవసరమైన 15 మందికి దుప్పట్లు, 54 మందికి దోమ తెరలను పంపిణీ చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ హాజరై సాయి భక్తులు గ్రామంలో చేస్తున్న సేవలను కొనియాడారు. జిల్లా సమన్వయ కర్తలు, భజన మండలి కన్వీనర్లు , స్థానిక భక్తులు దాదాపు 160 మంది హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, చివరగా స్వామి వారికి హారతి, విభూతి ప్రసాద వితరణ మరియు అందరూ మధ్యాహ్న భోజనం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని సంతోషంతో తెలియ జేస్తూ.... సదా సాయి సేవలో *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు- భూపాల పల్లి జిల్లా, తెలంగాణ.*