అందరికీ సాయిరాం... భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 96వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న శుభ సంధర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో *శ్రీ సాయి జననీ* గిరిజన సంక్షేమ సేవా కార్యక్రమాన్ని సెప్టెంబర్,2021 లో గంటలకుంట, గుండెంగివాయి, చింతలపాడు, ముదేలుతోగు, చింతలమోరి గిరిజన ప్రాంతాల్లో విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 200 మంది కుటుంబాలకు దుప్పట్లు, చీరలు, దోమ తెరలు, సోలార్ ల్యాంపులు, నీటి వడపోత కిట్ లను, చిన్న పిల్లలకు సాయి ప్రోటీన్ ఫుడ్ డబ్బాలు, స్వెట్టర్లు, 2- భోజన ప్లేట్లు, 2- గ్లాసులు, 1- ప్లాస్టిక్ మ్యాట్ లను కానుకలుగా అందించి, ప్రతి నెలా ప్రాథమిక వైద్య చికిత్సలు చేస్తూ, అవసరమైన మందులను, టానిక్ లను అందజేయడం జరుగుతున్నది. అలాగే జిల్లా అనుబంధ 13 భజన మండలి లలో మందిర స్వచ్ఛత సేవలు చేస్తూ, భక్తులకు చీరలు, దుప్పట్లు అందించి, చిన్న పిల్లలకు సాయి ప్రోటీన్ ఫుడ్ లను అందజేయడం జరిగింది. అలాగే *శ్రీ సత్యసాయి విద్యా జ్యోతీ కార్యక్రమంలో భాగంగా* కర్కపల్లి MPUPS పాఠశాలలో పిల్లలకు పెన్నులు, పెన్సిల్లు, నోట్ బుక్, సాయి ప్రోటీన్ ఫుడ్ లను అందజేయడం జరిగింది. ఈ రోజు శ్రీ సత్యసాయి మందిరంలో, తేది.23.11.2021 మంగళవారం ఉదయం 5.00 to 6.30 ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన 9.00 గంటలకు జిల్లా అద్యక్షులు Ch malla రెడ్డి గారిచే శ్రీ సత్యసాయి పతాక ఆవిష్కరణ, 1.00 నుండి మహా అన్న ప్రసాద సేవను దాదాపు 500 మందికి అందించి, సాయంత్రం 5.30 నుండి - ప్రత్యేక భజన, కేక్ కట్ చేయడం, ఉయ్యాల సేవ, మహా హారతి, విభూతి ప్రసాద వితరణ తో బాబా వారి 96వ పుట్టిన రోజు వేడుకలను విజయవంతం చేసిన జిల్లా సమన్వయ కర్తలు, యూత్ మహిళలు, పురుషులు, బాల వికాస్ పిల్లలు, భక్తులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపకు పాత్రులు అయ్యారని సంతోషంతో తెలియ జేస్తూ...... Dr V Ravinder కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి భూపాలపల్లి జయశంకర్ జిల్లా