ఓం శ్రీ సాయిరాం, స్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ద్వారా చేపట్టిన వివిధ ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాలలో భాగంగా మొట్ట మెదటి సేవా కార్యక్రమంగా "మహిళా విభాగం" వారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా తేదీ 13.11.2021, శనివారం నాడు ఉదయం 10.00 గంటలకు తాటిపెల్లి వద్ద గల గోశాల యందు గోమాతలకు సేవ చేయడం జరిగింది. గోవులకు మక్క పిండి , పత్తి పిండి , తవుడు , గడ్డి , పండ్లు మరియు వివిధ కూరగాయలు తదితరములను దాణా గా సమర్పించటం జరిగింది, అలాగే విష్ణు సహస్ర నామం కూడా జపించడం జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకొని ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి పుణ్య సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికీ ఆ సాయినాథుని దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం, ప్రేమతో ,కన్వీనర్ , భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల