ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికీ సాయిరాం! ఈ రోజు తేదీ 29.10.2021 రోజున పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పునఃప్రారంభించటం జరిగినది. 2020 లో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట్ రావు గారు, స్థానిక ఎం ఎల్ ఏ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారిచే ప్రారంభించిన ఈ అల్పాహార సేవ కోవిడ్ కారణంగా బడుల మూసివేత కారణంగా నిలిపివేయడం జరిగినది. ప్రధానోపాధ్యాయులు మళ్ళీ అల్పాహారము సేవ కోరినందువలన ఈ రోజు పునఃప్రారంభం చేయటం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా RDO శ్రీ శంకర్ నాయక్ గారు, పెద్దపల్లి జిల్లాDEO శ్రీమతి మాధవి గారు, గఱ్ఱెపల్లి MPTC శ్రీమతి పి.అనూష *గారు *, పాఠశాల ఉపాధ్యాయులు , స్థానికులు , పెద్దపల్లి సమితి , సుల్తానాబాద్ సమితి కన్వీనీర్లు, సేవాదళ్ *పాల్గొన్నారు. స్కూల్ బాలవికాస్ ను కూడా ప్రారంభించటం జరిగినది. జై సాయిరాం!