భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేది. 20-7-2021 మంగళవారము నాడు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని 06- భజన మండలి గ్రామాలలో ( రేగొండ, జగ్గయ్యపేట, రామగుండాల పల్లి, సుల్తాన్పూర్, జీ.కొత్తపల్లి మరియు నిజాంపల్లి) శ్రీ సత్యసాయి లిఖిత నామ జపం నోట్ బుక్స్ లను బాల వికాస్ పిల్లలకు మరియు పెద్దలకు అందజేయడం జరిగింది. ఈ సేవలో జిల్లా I.T. coordinator, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ మరియు సాయి యూత్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. లిఖిత నామావళి పుస్తకాలలో నామము రాయడం లో వున్న అంతరార్ధాన్ని తెలియజేస్తూ, లోక కళ్యాణం కొరకు స్వామి వారు అందించిన పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలని, ఈ సేవలో పాల్గొంటున్న భక్తులందరికీ స్వామి వారి అండ దండలు తప్పక వుంటాయని తెలియ జేస్తూ.... సదా సాయి సేవలో, Ch మల్లా రెడ్డి , జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జిల్లా.