భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, ఈ నెల మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా వారు చేపట్టిన సేవా కార్యక్రమాలు,,, బూరుగు పల్లి సమితి వారు సాయి గాయత్రి మంత్రం తో తండుల అర్చన చేసి ఒక కుటుంబానికి నెల రోజుల కు సరిపడు కిరాణా సరుకులు అంద జేశారు. హుస్న బాద్ సమితి వారు ముగ్గురికి అమృత కలశం లు ఇచ్చారు. గజ్వేల్ సమితి వాళ్ళు ఇళ్లలో లలితా సహస్రనామ పారాయణ చేసి, గతం లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పది మంది మహిళల కి సర్టిఫికెట్స్ ప్రదానం చేసి, కొత్తగా పది మంది మహిళల తో కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం చేయడం జరిగింది. సిద్దిపేట సమితి వారు రుద్రాభిషేకం సాయంత్రం సాయి గాయత్రి మంత్రం తో తండుల అర్చన చేసి ఐదు మంది కి అమృత కలశం లు, ఇద్దరు పేషంట్స్ కి నెల రోజుల కు కావలసిన మెడిసిన్ ఇప్పించడం, ఒక మహిళ కి ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ అంద జేయడం జరిగింది. జిల్లా మహిళా విభాగం వారు SSSVJ దాచారం స్కూల్ విద్యార్థుల క్షేమ సమాచారం తెలుసుకుని 75 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ రెండు జతల Inner wears మరియు ప్రసాదం అందజేసి 35 మంది విద్యార్థులకు లిఖిత నామ జపం బుక్స్ ఇవ్వడం జరిగింది. SSSVIP ఆరే పల్లి లో అంగన్వాడీ విద్యార్థులు 20 మందికి రెండు జతల చొప్పున Inner wears అంద జేయడం జరిగింది. సదా సాయి సేవలో,,, BSSSSO జిల్లా సిద్దిపేట. జై సాయిరాం.