ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ విపత్కర పరిస్థితులలో తేదీ 29/05/2021 శనివారం రోజున గజ్వెల్ సమితి వారు, కరోనా వ్యాధి సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న 74 మందికి నారాయణ సేవలో భాగంగా ఫుడ్ ప్యాకెట్స్ ,కర్రీ,సాంబారు ,మజ్జిగ,బత్తాయి పండు,స్వామి వారి చిత్రపటం మరియు విభూతి ప్యాకెట్స్ ను అందించడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్ సిబ్బందికి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజువరకు నారాయణ సేవ ద్వారా ఆహారం తీసుకున్న మొత్తం 15 కుటుంబాలు కోవిడ్ నుండి పూర్తిగా కోలుకోవడం జరిగింది, అందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నాం. జై సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. సిద్ధిపేట జిల్లా.