ఓం శ్రీ సాయిరాం భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికి సాయిరాం శ్రీ సత్యసాయి సేవా మందిరం ,పెద్దపల్లి లో ఈ రోజు తేదీ 27/5/2021 రోజున 40 అమృత కలశములు నిరుపేదలకు , ప్రైవేట్ టీచర్లకు , అవసరం గల బాలవికాస్ విద్యార్థినులకు స్వామి వారి ప్రసాదంగా అందజేయటము జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ గారు పాల్గొని స్వామి వారి సేవా కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని , నా పూర్వ జన్మ సుకృతము వలన స్వామి వారిని నేను హిందూ పురములో భాద్యతలు నిర్వహిస్తున్నప్పుడు దర్శనం చేసుకున్నానని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.పెద్దపల్లి జిల్లా లో శ్రీ సత్యసాయి సేవా* సంస్థలు ఇలాంటి ఆపత్కర సమయములో సేవలు చేయటం చాలా సంతోషకరమని , స్వామి వారి భక్తులు ప్రపంచ దేశాల్లో కూడా మానవ సేవే మాధవుని సేవ లాగా సేవలు చేయటం చాలా గర్వించదగ్గ విషయమని హర్షం వ్యక్తము చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సమితి కన్వీనర్ శ్రీ బొల్లం లక్ష్మీ నారాయణ గారు , జిల్లా బాలవికాస్ కో ఆర్డినేటర్ శ్రీమతి జ్యోతి గారు , సేవాదళ్ విజయ్ సింగ్ ఠాకూర్ , మారుతి , మల్లేశం , నాగలక్ష్మిగార్లు పాల్గొన్నారు.ఈ సేవా భాగ్యం కల్పించిన స్వామి వారికి మరియొక సారి* ప్రణమిల్లుతూ , పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలనిమనస్స్పూర్తిగా కోరుకుంటూ*......... జై సాయిరాం సదా సాయి సేవలో..... శ్రీ సత్య సాయి సేవా మందిరం ,పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , పెద్దపల్లి జిల్లా.