ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులచే ఈ రోజు శ్రీ సత్యసాయి నిత్యాన్న సేవా పథకం ద్వారా శ్రీ సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల మందిరంలో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించబడినది. ఇందులో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వండిన ఆహారాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో కోవిడ్ మరియు ఇతర పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ ప్రతి రోజు మధ్యాన్నం భోజనం అందించుటకు ఏర్పాటు చేయనైనది. ఈ రోజు 120 మందికి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ మురళీధర్ రావు గారి చేతుల మీదుగా పంపిణీ చేయనైనది. ఇందులో పాల్గొన్న సేవదల్ సబులందరికీ స్వామి వారి యొక్క ఆశీస్సులు దండిగా ఉండాలని , వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఈ కార్యక్రమము నిరంతరం కొనసాగేల స్వామి వారు అనుగ్రహించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తూ.. సాయిరాం! శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల