ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు 16/11/2019 శనివారం సాయంత్రం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని సత్యసాయిమందిరంలో శ్రీ కోట శివకుమార్(భగవాన్ శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీపూర్వ విద్యార్థి) గారి ఆధ్యాత్మిక సందేశ ప్రసంగం అద్భుతంగా జరిగింది..ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు ఏర్పరచుకోవలసిన ధ్యేయాన్ని ,పరులు పరులు కాదు పరమాత్ముడేనని గ్రహించి ఇతరులను దూషించకుండా, ప్రతి ఒక్కరు మృదు మధుర భాషణలతో మెలగాలని మరెన్నో స్వామివారి సందేశాలను ప్రేమతో పంచారు..ఈ కార్యక్రమంలో శ్రీ బులుసు సాంబ మూర్తి గారు స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ మరియు శ్రీ DV ప్రసాద రావు గారు స్టేట్ ఆధ్యాత్మిక జాయింట్ కోఆర్డినేటర్, శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారు పాల్గొన్నారు