ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 23/11/2019 శనివారం ఉదయం ఖమ్మం సత్యసాయి నగర్ (శ్రీనివాసనగర్ )లోని సత్యసాయి మందిర ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయి పాదుకా మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించ బడింది. వేద పండితులు స్వామి పాదుకా పూజ మహోత్సవం నిర్వహించగా ప్రముఖ వక్త , విద్వాంసులు శ్రీ కపిలవాయి అచ్యుత రామారావు గారు వ్యాఖ్యానం ద్వారా పాదుకా పూజ విశిష్టతను, విధానాన్ని భక్తులకు తెలియజేశారు.. ఈ సందర్బంగా స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ బులుసు సాంబమూర్తి గారు పాదుకా పూజ ప్రాముఖ్యతను, ప్రతి సభ్యుడు ఆచరించవలసిన స్వామి సందేశాలను ప్రేమతో తెలియజేస్తూ ప్రసంగించారు. ఎంతో ప్రేమతో వివిధ గ్రామాలనుండి వేలాది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. అందరికీ స్వామి వారి మహాప్రసాదాన్ని సేవాదల్ సభ్యులు క్రమశిక్షణతో ప్రేమతో అందించారు. మందిర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.