భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం తో శ్రీ సత్యసాయి సేవా సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో " టైలరింగ్ " రెండవ బ్యాచ్ మరియు "మగ్గం & జర్దోసి" మూడవ బ్యాచ్ ఉచిత శిక్షణా తరగతులు సోమవారం 29/07/2019 నాడు సమయం ఉదయం 11:00 గం.లకి ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా సమన్వయకర్తలు శ్రీమతి సుధా పూర్ణచందర్ గారు మరియు శ్రీమతి నివేదిత గారు విచ్చేసి జిల్లా అధ్యక్షులు శ్రీ బూర రవీందర్ గారు, సమితి కన్వీనర్ అన్నల్దాస్ రాము గారు మరియు సేవాదళ్ కో ఆర్డినేటర్ ఉమాశంకర్ గారు మరియు జిల్లా మహిళా సమన్వయ కర్తలు శ్రీమతి సుకన్య, శ్రీమతి వీణ గార్ల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.