సాయిరాం, నేడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి ఆరాధన మహోత్సవము ఆల్వాల్ శ్రీ సత్య సాయి సేవా సమితిలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు నేడు తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం నగరసంకీర్తన తరువాత స్వామికి సామూహిక షాడోశోపచారా పూజ సామూహిక అష్టోరం నిర్వహించారు,ఉదయం గం 7 30 ని నుండి గం 12 వరకు నారాయణ సేవా చేయడానికి వంట సమితి సేవా మందిరములో సేవాదళ్ సభ్యులు చేసారు మధ్యాహ్నం గం 12 30 ని నుండి సాయంత్రం గం 3 .30 ని వరకు లోతుకుంట బస్సు స్టాప్ సమితి వారు నిర్వహిస్తున్న చలివేంద్రం దగ్గర టెంట్లు వేసి నారాయణ సేవా చేసారు సుమారు 630 నారాయణలు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు నారాయణ సేవా జరుగుతున్నంతసేపూ సేవాదళ్ సభ్యులు రెట్టింపు ఉత్సవముతో మహిళా పురుష సేవాదళ్ సభ్యులు సేవా చేసారు మరియు సాయంత్రం గం 6 నుండి గం 8 వరకు ఓమకరం పదకొండ్లు సార్లు సాయి గాయత్రి చెప్పి భజన స్వామి వారి కీర్తనలు అనంతరం శ్రీ ప్రకాష్ రావు గారి ప్రసంగం ఆద్యంతరహితంగా సాగుతున్నంత సేపు భక్తులు పిన్ డ్రాప్ సైలెన్స్ తో తన్మయంతో ఆలకించారు.శ్రీ ప్రకాష్ రావు తన ప్రసంగంలో స్వామి వారి గురుంచి వివరిస్తూ స్వామి మరణించలేదు భక్తుల హృదయాలలోనే నివసిస్తున్నారు భక్తి శ్రద్దలతో అంతరముఖం చేసి స్వామివారి ప్రార్థిస్తూ మాట్లాడితే స్వామివారి పలుకులు సుస్పష్టనంగా వినగలుగుతాము అంటూ ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు వివరించారు.ప్రసంగం తరువాత స్వామి వారికీ హారతి మరియు ప్రసాద వితరణతో కార్యక్రమము పూర్తయింది.-జె ఈశ్వర్ రావు కన్వీనర్