ఓం శ్రీ సాయిరాం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో సత్యసాయి సంస్థ ప్రధాన బాధ్యుల ఆదేశాల మేరకు నిలిపివేసిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిత్య అన్నదానం సేవా కార్యక్రమం స్వామి కృప కటాక్షాలతో మరియు ఖమ్మం జిల్లా కలెక్టరు గారు అయిన శ్రీ కణ్నన్ గారి ఆదేశానుసారం తిరిగి ఈరోజునుండి ప్రారంభించబడినది. ఈ కార్యక్రమంలో శ్రీమతి అంజలి గారు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పాల్గొన్నారు. అంతేకాకుండా ఖమ్మం ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఉదయం మరియు సాయంత్రం అల్పాహారం అందించే సేవా కార్యక్రమం కూడా నిన్నటినుండి ప్రారంభించబడినది.