ఓంశ్రీసాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి పరిపూర్ణ దివ్య ఆశీస్సులతో.. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగము ఆధ్వర్యంలో 26 మంది మహిళలకు గత 57 రోజులుగా నిర్వహించబడుతున్న జర్దోషి మగ్గం వర్క్ శిక్షణ తరగతులు మరియు 20 మంది మహిళకు టైలరింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ ప్రదానం మరియు ముగింపు కార్యక్రమం 01.10.2019 మంగళవారం రోజున ఉదయం 11.00గం.ల నుండి 02.00గం.ల వరకు శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో నిర్వహించబడింది. ఈ యొక్క ముగింపు వేడుకలకు అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ పాషా గారు అతిథులుగా విచ్చేసి మహిళలను ప్రోత్సహించారు మరియు సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 15మంది మహిళా సేవాదళ్ సభ్యులు మరియు 10మంది పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.