ఓం శ్రీ సాయిరామ్ *భగవాన్ బాబావారి దివ్య ఆరాధనోత్సవాలు* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, నాచారం సమితిలో, స్వామివారి దివ్య ఆరాధనోత్సవాలు. 24.04.2019 బుధవారం ఉదయం 4.45 ని.లకి ఓంకారం, సుప్రభాతం, నగరసంకీర్తన జరిగింది. ఇందులో 15మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 11.30 ని.లకి హబ్సిగూడా, సీసీఎంబీ బస్టాండ్ సమీపంలోని చలివేంద్రం దగ్గర మహా నారాయణసేవ ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహించబడింది. ముందుగా స్వామివారి పూజ, భజన అనంతరం ఏరియా ట్రాఫిక్ ఇనస్పెక్టర్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు మరియు సమితి పెద్దలు శ్రీ వీరమల్లుగారు మహా నారాయణ సేవ ప్రారంభించారు. ఉ.11.30 నుండి మధ్యాహ్నం 3.00 వరకు సుమారు 750 మంది నారాయణులకు స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. అదేసమయంలో చెనగచెర్ల లోని అమ్మ ఆసరా అనాధ శరణాలయంలో 70 మందికి నారాయణ సేవ జరిగింది. చలివేంద్రం దగ్గర పాదరక్షల వితరణ కూడా నిర్వహించబడింది. 10మంది మగవారు,15మంది మహిళలు సేవాదళ్ పాల్గొని, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక ఆరాధనా భజనలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆరాధనోత్సవాలలో రెండవరోజు కార్యక్రమంలో 25.04.2019,గురువారం నాడు సాయంత్రం 7.00గం. లకి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబుగారి ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. రేపటి కార్యక్రమంలో కూడా సాయి కుటుంబ సభ్యులందరు పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాలని మా ప్రార్ధన. జై సాయిరామ్ కన్వీనర్ నాచారం సమితి. 💐💐💐💐💐💐💐💐💐💐